Breaking News

ప్రియుడితో వెళ్లిపోయిన కూతురు.. అవమానంతో తల్లి ఆత్మహత్య

తాను ఇంతకాలం పెంచి పెద్దచేసిన కూతురు తన మాట వినకుండా ప్రియుడితో వెళ్లిపోవడాన్ని ఓ తల్లి సహించలేకపోయింది. అవమానం భారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొన్నది. తమిళనాడులో రాష్ట్రంలో జరిగిందీ ఘటన.. తిరువళ్లూర్‌ జిల్లా తిరుత్తణి నెహ్రూనగర్‌కు చెందిన శ్రీనివాసన్‌, మహేశ్వరి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారి కూతురు పదో తరగతి చదువుతున్నప్పటి నుంచే ఓ యువకుడిని ప్రేమించింది.

ఈ నెల 10న అతనితో పారిపోయింది. తల్లిదండ్రులు, బంధువులు కుమార్తె కోసం పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో కూతురు చేసిన పనిని మహేశ్వరి అవమానంతో కుంగిపోయింది. ఈనెల 11న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్​ పోసుకొని నిప్పంటించున్నది. గమనించిన స్థానికులు ఆమెను తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్సపొందతూ ఆదివారం రాత్రి ప్రాణాలు కోల్పోయింది.