Breaking News

ప్రభాస్​కు జోడీగా నివేథా.. ఫ్యాన్స్​ నిరాశ

యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్​ సరసన నివేథా థామస్​ చాన్స్​ దక్కించుకుందట. నాగ్​అశ్విన్​ దర్శకత్వంలో ప్రభాస్​ ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇప్పటికే దీపికాపదుకొనే హీరోయిన్​గా ఎంపికకాగా.. సెకండ్​ హీరోయిన్​గా నివేథా థామస్​ను తీసుకోనున్నట్టు టాక్​. బాహుబలి సీరిస్​ తర్వాత ప్రభాస్​ రేంజ్​ పాన్​ ఇండియా స్టార్​గా ఎదిగారు. కాగా బాహుబలి తర్వాత వచ్చిన ‘సాహో’ విజయవంతం కాకపోయినప్పటికీ.. ఉత్తరాదిన మంచి వసూళ్లే రాబట్టింది. ఇక ప్రస్తుతం ప్రభాస్​ రాధాకృష్ణకుమార్​ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’​ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రభాస్​ చేసే ప్రతి సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మాతలు. ఈ క్రమంలోనే నివేథాను ఎంపికచేసినట్టు సమాచారం. ‘రాధేశ్యామ్’ చిత్రం పూర్తవగానే.. నాగ్ అశ్విన్‌తో చిత్రానికి ప్రభాస్ రెడీ అవుతారు. నివేథా థామస్​ ఎంపికపట్ల ప్రభాస్​ ఫ్యాన్స్​ కొంత నిరాశతో ఉన్నట్టు టాక్​. ప్రభాస్​ హైట్ కు ఆమె సరిపోదని వారి అభిప్రాయం.