Breaking News

ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టండి

సారథి న్యూస్​, ఎల్బీనగర్: ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని 9 డివిజన్లకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించినట్లు శుక్రవారం తెలిపారు.
డివిజన్​ అధ్యక్షులు వీరే..
చంపాపేట్ డివిజన్ అధ్యక్షుడిగా దాచర్లపల్లి శ్రీపాల్ రెడ్డి, హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడిగా గుర్రం శ్రీనివాస్ రెడ్డి, వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడిగా నరసింహ యాదవ్, నాగోల్ డివిజన్ అధ్యక్షుడిగా ముస్కు శేఖర్ రెడ్డి, లింగోజిగూడ డివిజన్ అధ్యక్షుడిగా మల్లారపు శ్రీనివాస్, చైతన్యపురి డివిజన్ అధ్యక్షుడిగా శశిధర్ రెడ్డి, కొత్తపేట్ డివిజన్ అధ్యక్షుడిగా లింగాల కిషోర్ గౌడ్, హస్తినాపూర్ డివిజన్ అధ్యక్షుడిగా దేంది శశిధర్ రెడ్డి, మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా బుడ్డా సత్యనారాయణను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. నూతన అధ్యక్షులు ఆయా డివిజన్లలో నూతన కమిటీలను నియమించాలని సూచించారు.