Breaking News

ప్రగతిపథంలో తెలంగాణ

సారథిన్యూస్, రామడుగు/ గంగాధర: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో రూ. 15 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. కాగా గంగాధర మండలం కొండయ్యపల్లిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ గురువు చెట్టుపల్లి కొండయ్య అనారోగ్యంతో మృతిచెందారు. వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కల్గెటి కవిత, ఎంపీటీసీ అట్ల రాజిరెడ్డి, వీర్ల సరోజన, సింగిల్​ విండో డైరెక్టర్​ ఆముదాల రమణారెడ్డి, టీఆర్​ఎస్​ నేతలు చెట్టిపల్లి నరేందర్​, తిరుపతి, జిల్లా కో-ఆఫ్షన్ మెంబర్​ సుక్రోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.