షార్జా: ఐపీఎల్13 సీజన్లో భాగంగా షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ)తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) చివరి దాకా పోరాటం చేసి ఓడిపోయింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సిక్సర్ల మోత మోగింది. 18 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచిన కేకేఆర్ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) 229 పరుగుల భారీ టార్గెట్ను నిర్దేశించింది. పృథ్వీషా(66, 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు), శ్రేయస్ అయ్యర్(88 నాటౌట్; 38 బంతుల్లో 7ఫోర్లు, 6 సిక్స్లు), రిషభ్ పంత్(38; 17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. కేకేఆర్ బౌలర్లలో నాగర్కోటి, వరుణ్ చక్రవర్తికి చేరో వికెట్ పడింది. రసెల్ కు రెండు వికెట్లు పడ్డాయి.
అనంతరం బ్యాటింగ్కు దిగిన కేకేఆర్ మొదటి నుంచీ వీరోచిత పోరాటమే చేసింది. శుభ్మన్ గిల్ 28( 22 బంతులు, 4 ఫోర్లు, ఒక 6), రానా 58( 35 బంతులు, 4 ఫోర్లు, 4 సిక్స్లు), ఇయాన్ మోర్గాన్ 18 బంతుల్లో 5 సిక్స్లు, ఒక ఫోర్తో 44 పరుగులు చేశాడు. రాహుల్ త్రిపాఠి 16 బంతుల్లో 3 సిక్స్లు, 3 ఫోర్లు) 44 పరుగులు చేశాడు. ఇయాన్ మోర్గాన్, రాహుల్ త్రిపాఠి క్రిజ్ ఉన్నంత సేపు సిక్స్ల మోత మోగింది. ఒక దశలో కోల్కతా గెలుస్తుందని అంతా భావించారు. ఇంతలో మోర్గాన్ బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఒక్కసారిగా గెలుపు ఆశలు తలకిందులయ్యాయి. లక్ష్య ఛేదనలో భాగంగా కేకేఆర్ 8 వికెట్ల నష్టానికి 210 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో నార్త్జే కు మూడు, హెవీ పటేల్కు రెండు, రబడ, ఏ మిశ్రా, స్టాయినీస్కు ఒక్కో వికెట్ చొప్పున పడ్డాయి.
- October 4, 2020
- Archive
- Top News
- క్రీడలు
- DELHICAPITALS
- KKR
- KOLKATA
- KOLKATA KNIGHTRIDERS
- కేకేఆర్
- కోల్కతా
- ఢిల్లీ క్యాపిట్స్
- పృథ్వీషా
- Comments Off on పోరాడి ఓడిన ‘కోల్కతా’