Breaking News

‘పెంగ్విన్’ ట్రైలర్ అదిరింది

‘మహానటి’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ల లిస్ట్​లో చేరింది కీర్తిసురేష్. నెక్ట్స్ ఓ సైకలాజికల్ థ్రిల్లర్​తో ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి ప్రధానపాత్రలో ఈశ్వర్ కార్తీక్ రూపొందించిన ‘పెంగ్విన్’ సినిమా మూడు భాషల్లో ఓటీటీ ప్లాట్ ఫామ్​లో రిలీజ్​కు సిద్ధమైంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమా నిర్మాత. ఈ సినిమా ట్రైలర్​ ను గురువారం తెలుగులో నాని, తమిళంలో ధనుష్, మలయాళంలో మోహన్ లాల్ విడుదల చేశారు. ఓ అడవికి సమీపంలో ఓ ఫామ్ హౌస్​ కీర్తి ఫ్యామిలీ ఉంటారు. గర్భవతిగా కనిపిస్తున్న కీర్తికి అప్పటికే ఓ ఐదేళ్ల కొడుకు ఉంటాడు. సడెన్​గా తన కొడుకు కనిపించకుండా పోతాడు. పోలీసులు ఎంతగా వెదకినా దొరక్కపోయేసరికి ఆ అబ్బాయి చనిపోయాడని..

సైకో కిల్లర్ చంపేసి ఉండొచ్చని తేల్చేసిన పోలీసులు కేస్ క్లోజ్ చేయాలనుకుంటారు. కానీ తల్లి ప్రేమ ఆ విషయాన్ని నమ్మ నివ్వదు. తానే స్వయంగా కొడుకు కోసం అన్వేషించడం ప్రారంభిస్తుంది. కొడుకుని ఏ స్థితిలో చేరుకుంటుంది? అన్నది మిగతా కథ. రెండు నిముషాల నిడివితో ఉన్న ట్రైలర్ ప్రేక్షకులను థ్రిల్ చేసేలా సాగింది. సంతోష్ నారాయణన్ బ్యాక్​ గ్రౌండ్​ మ్యూజిక్​ అందించారు. లాక్‌డౌన్‌తో థియేటర్స్ ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితులు లేకపోవడంతో ‘అమెజాన్‌ ప్రైమ్’ ద్వారా జూన్ 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.