Breaking News

పిచ్చాసుపత్రిలో 23 మందికి కరోనా

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలన్నింటిని వణికిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కేసులతో సర్వత్రా ఆందోళన నెలకొన్నది. తాజాగా ఢిల్లీ సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఓ మానసిక వికలాంగుల ఆశ్రమంలో 8 మంది పిల్లలతోపాటు 23 మందికి కరోనా సోకింది. ఈ ఆశ్రమంలో 960 మంది మానసిక వికలాంగులు ఉంటున్నారు. ఈ నెల 5నుంచి 20వతేదీ వరకు మానసిక వికలాంగుల ఆశ్రమంలో కరోనా పరీక్షలు చేయగా 23 కరోనా పాజిటివ్ అని తేలింది. ఇందులో ముగ్గురు ఉద్యోగులు కూడా ఉన్నారు. పిల్లల్ని సుల్తాన్ పురిలోకి కొవిడ్ కేర్ సెంటరులో క్వారంటైన్ చేశారు. ఆశ్రమంలోని పెద్దవారిని అశోక్ విహార్ లోని జీటీబీ ఆసుపత్రిలో చేర్చారు. కరోనా సోకడంతో ఈ మానసిక వికలాంగుల ఆశ్రమంలో బయటివారిని లోపలకు రానీయడం లేదు.