Breaking News

‘పాలమూరు’ పనుల పరిశీలన

‘పాలమూరు’ పనుల పరిశీలన


సారథి న్యూస్, నాగర్​కర్నూల్: నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్ నియోజవర్గం పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ ​వద్ద జరుగుతున్న పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను శుక్రవారం మంత్రులు వి.శ్రీనివాస్​గౌడ్, ఎస్.నిరంజన్​రెడ్డి, నాగర్​కర్నూల్​ ఎంపీ పి.రాములు, మహబూబ్​నగర్​ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి తదితరుల బృందం​ పరిశీలించింది. పనులను వేగవంతంగా పూర్తిచేయాలని, నాణ్యతగా ఉండాలని సూచించింది. బృందంలో ప్రభుత్వ విప్​ గువ్వల బాలరాజు, జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్​, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే ఎస్​.రాజేందర్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, కొల్లాపూర్​ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్​రెడ్డి, కలెక్టర్​ఎల్.శర్మన్​ ఉన్నారు.