Breaking News

పాలమూరులో ఫుడ్​ ప్రాసెసింగ్​ సెజ్

  • హన్వాడ– మహబూబ్​ నగర్​లో మధ్య ఏర్పాటు
  • మంత్రి వి.శ్రీనివాస్​ గౌడ్​ వెల్లడి

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: వెయ్యి ఎకరాల్లో ఫుడ్​ ప్రాసెసింగ్​ సెజ్​ను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, హన్వాడ– మహబూబ్​ నగర్​లో మధ్యలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ వివరించారు. శుక్రవారం మహబూబ్​ నగర్​ కలెక్టరేట్​లోని రెవెన్యూ మీటింగ్​ హాల్​లో అధికారులతో సమీక్షించారు. ప్రతి నియోజకవర్గంలో 20 ఎకరాల్లో రెండు గోదాములను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. రైతులు నకిలీ విత్తనాలు కొని నష్టపోకూడదని సూచించారు. నియంత్రిత వ్యవసాయ పద్ధతిపై అవగాహన కల్పించేందుకు క్లస్టర్ల వారీగా సదస్సులు నిర్వహిస్తామన్నారు. వానాకాలం యాక్షన్​ ప్లాన్​పై మంత్రి కలెక్టర్​ వెంకట్రావుతో చర్చించారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్లు సీతారామారావు,మోహన్ లాల్ తదితరులు పాల్గొన్నారు.