![నిరసన వ్యక్తం చేస్తున్న మున్సిపల్ కార్మికులు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/LABOUR.jpg?fit=945%2C245&ssl=1)
సారథి న్యూస్, రామాయంపేట: పారిశుద్ధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.5000 వేల ఇన్సెంటివ్, పెరిగిన రూ. 8500 జీతం వెంటనే ఇవ్వాలని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. కరీంనగర్ జిల్లా ఉమ్మడి రామాయంపేట మండలంలోని పలుగ్రామాల పారిశుద్ధ్య కార్మికులు ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల దగ్గర ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు నింగోళ్ల సత్యం తదితరులు పాల్గొన్నారు. కార్మికులందరికీ బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.