Breaking News

పారదర్శకంగా అవుట్​ సోర్సింగ్​ ఉద్యోగాలు

పారదర్శకంగా అవుట్​సోర్సింగ్​ఉద్యోగాలు

సారథి న్యూస్, కర్నూలు: అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకే ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌ను ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్​రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అమరావతి సచివాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఏపీ ఆప్కాస్ ను ప్రారంభించి 50,449 మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు నియామక పత్రాలు జారీచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి మధ్యదళారులు, ఏజెన్సీల ప్రమేయం లేకుండా ఆప్కాస్​ను ఏర్పాటు చేశామన్నారు. అవుట్​ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీలకు 50 శాతంతో పాటు మహిళలకు కూడా 50 శాతం కేటాయించామన్నారు. ఉద్యోగాల్లో ఈఎస్​ఐ, ఈపీఎఫ్​వంటి విధానాలు సక్రమంగా పాటించాలని ఆదేశాలు జారీచేశామన్నారు. ఈ వ్యవస్థను ఇక నుంచి జిల్లా కలెక్టర్లే స్వయంగా పర్యవేక్షించాలని సీఎం సూచించారు. కర్నూలు జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ జి.వీరపాండియన్, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జేసీ 3 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, అవుట్ ​సోర్సింగ్ ​ఉద్యోగులు పాల్గొన్నారు.