Breaking News

పాయల్.. ఇది నిజమా!

పాయల్.. ఇది నిజమా!

‘ఆర్​ఎక్స్​100’ మూవీతో గ్లామర్, యాక్షన్​ రెండిటికీ సమపాళ్లలో న్యాయం చేసే నటిగా ప్రూవ్​చేసుకుంది పాయల్ రాజ్​పుత్. ఇప్పుడు మళ్లీ సేమ్​ డైరెక్టర్​ కాంబినేషన్​లో నటించనుందట. హీరోయిన్​గా కాదు.. తనకు హీరోయిన్​గా సక్సెస్ ​ఇచ్చిన అజయ్​ భూపతి ‘మహాసముద్రం’ మూవీలో స్పెషల్​సాంగ్​లో మెరవనుందట పాయల్. వెంకీమామ, డిస్కోరాజా చిత్రాల్లో పెద్ద హీరోలతో నటించినా ఫస్ట్​మూవీకి వచ్చినంత క్రేజ్​ సంపాదించలేకపోయింది పాయల్. ఇప్పుడు ఈ చిత్రంలో స్పెషల్​ సాంగ్​ చేయనుంది అంటూ పుకారు వినిపిస్తోంది. ఏకే ఎంటర్ టైన్​మెంట్​బ్యానర్ పై సుంకరరామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ మూవీ లో శర్వానంద్, సిద్ధార్థ హీరోలుగా, అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్​హీరోయిన్స్​గా నటిస్తున్నారు. ఇంటెన్స్​లవ్​స్టోరీ గా రూపొందనున్న ఈ మూవీ షూటింగ్ ​వైజాగ్​లో జరుగుతోంది. వచ్చే ఏడాది రిలీజ్​కు సిద్ధమవుతోంది. కానీ పాయల్ ​సాంగ్​రోల్ ​చేయనుందో లేదో ఇంకా క్లారిటీ అయితే లేదు. రీసెంట్​గా ఓటీటీలో రిలీజైన ‘అనగనగా ఓ అతిథి’ చిత్రంతో ఇంప్రెస్​చేసిన పాయల్​ ప్రస్తుతం ‘ఏంజిల్’ తమిళ సినిమా, ‘5డబ్ల్యుఎస్’​ బైలింగ్వల్​చిత్రాల్లో నటించనుంది.