Breaking News

పల్లెలన్నీ పచ్చబడాలి

సారథిన్యూస్, రామడుగు: హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో పల్లెలన్నీ పచ్చ బడాలని కరీంనగర్​ కలెక్టర్​ శశాంక పేర్కొన్నారు. గురువారం ఆయన రామడుగు మండలం శ్రీరాముల పల్లె గ్రామంలో ఆరోవిడుత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఎస్సీ కాలనీలో హరితవనం పార్కును సందర్శించారు. మరోవైపు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వన్​టౌన్​ పోలీస్​స్టేషన్​లో ఏసీసీ రామేశ్వర్​, మున్సిపల్​ చైర్మన్​ రాజనర్సు, సీఐ సైదులు మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్​ కోమల్ రెడ్డి, ఎంపీడీవో సతీశ్​రావు, సర్పంచ్ జీవన్, ఎంపీటీసీ మోదీ రవి, మాజీ సర్పంచ్ వెంకటరమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.