Breaking News

నో మాస్క్.. నో ఎంట్రీ

నో మాస్క్.. నో ఎంట్రీ

సారథి న్యూస్, కర్నూలు: యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కట్టడిపై పకడ్బందచర్యలు తీసుకోవాలని కోవిడ్ 19 రాష్ట్రస్థాయి స్పెషల్ అధికారి అజయ్ జైన్ సూచించారు. మంగళవారం ఆదోని పట్టణంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, అధికారులతో కలిసి సమీక్షించారు. మాస్కులు లేకుండా బయట తిరిగితే వారిపైన జరిమానా విధించాలన్నారు. నో మాస్క్.. నో ఎంట్రీ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పోలీసులకు సూచించారు. ఆదోనిలో పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని టెస్టింగ్ లపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్– 2 (అభివృద్ధి) రాంసుందర్ రెడ్డి, ఆదోని ఆర్డీవో బాలగణేశయ్య, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.