Breaking News

నేటి నుంచి అమెరికాకు ఫ్లైట్స్​

నేటి నుంచి అమెరికాకు ఫ్లైట్స్​
  • విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడి

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా నిలిచిన పోయిన అంతర్జాతీయ విమానయాన సర్వీసులు శుక్రవారం నుంచి పున:ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ జూలై 17 నుంచి 31 మధ్య 18 ఫ్లైట్స్​ను నడపనుందని ఆయన వెల్లడించారు. ఎయిర్ ఫ్రాన్స్ సైతం జులై 18 నుంచి ఆగస్టు 1 మధ్య 28 విమాన సర్వీసులను నడపనుందని తెలిపారు. ఢిల్లీ -న్యూయార్క్ మధ్య ప్రతిరోజు ఢిల్లీ – శాన్ ఫ్రాన్సిస్కో మధ్య వారానికి మూడురోజులపాటు విమానాలు నడవనున్నాయని కేంద్రమంత్రి చెప్పారు. అదే సమయంలో భారత్ నుంచి ఎయిరిండియా ఈ రెండు దేశాలకు విమానాలను నడపనుంది. ఈ మేరకు అమెరికా, ఫ్రాన్స్ దేశాలతో భారత్ ఒప్పందం చేసుకుంది.