Breaking News

నిరాడంబరంగా ఇండిపెండెన్స్​ డే

నిరాడంబరంగా ఇండిపెండెన్స్​డే

సారథి న్యూస్​టీం: 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర ప్రముఖులు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి సెల్యూట్​చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. అసెంబ్లీ అవరణలో నిర్వహించిన వేడుకల్లో స్పీకర్​పోచారం శ్రీనివాస్​రెడ్డి పాల్గొన్నారు. ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి కలెక్టరేట్​లో జరిగిన సంబరాల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సూర్యాపేట కలెక్టరేట్​లో జరిగిన వేడుకల్లో మంత్రి జి.జగదీశ్వర్​రెడ్డి పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని జెండాను ఎగరవేశారు. అలాగే సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నాగర్​కర్నూల్​జిల్లా అచ్చంపేటలో ప్రభుత్వ విప్​ గువ్వల బాలరాజ్​జాతీయ జెండాను ఎగరవేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకల్లో మండలిలో ప్రభుత్వ విప్​కూచకుళ్ల దామోదర్​రెడ్డి పాల్గొన్నారు.