Breaking News

నిద్రమత్తే మృత్యువైంది

నిద్రమత్తే మృత్యువైంది

చింతపల్లి: హైదరాబాద్ – నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం ధైర్యపురితండా వద్ద కారు వేగం అదుపుతప్పి బోల్తాపడింది. రోడ్డు పక్కన వాటర్​లైన్​పిల్లర్​ను ఢీకొని కారు ఐదారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి మల్లేపల్లి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణం కారణమని తెలుస్తోంది. కారులో ఇరుక్కపోయిన మృతదేహాలను పోలీసులు అతికష్టం మీద బయటికి తీశారు. మృతిచెందిన యువకులను హైదరాబాద్ కు చెందినవారిగా భావిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు.