Breaking News

నాటిన మొక్కలను రక్షిద్దాం

పెద్దపల్లి: మొక్కలు నాటడమే కాక వాటిని సంరక్షించడం ముఖ్యమని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్​ పరిధిలోని మల్కాపూర్ వద్ద ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరోవైపు కరీంనగర్​ జిల్లా చొప్పదండి పోలీస్​స్టేషన్​లో సీఐ రమేశ్​, ఎస్సై అనూష మొక్కలు నాటారు. పెద్దపల్లి జిల్లాలోని ఎరువుల కర్మాగారం ప్రాంగణంలో ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ రాజన్​ తప్పర్​ మెక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీ బోర్లకుంట వెంకటేశ్​ నేతకాని, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ప్రభుత్వ విప్ బల్క సమన్, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మేయర్ డాక్టర్ అనిల్​, పోలీస్​ కమిషనర్​ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.