![నాగర్కర్నూల్ కలెక్టర్ పై బదిలీ వేటు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/coll-2-f.jpg?fit=330%2C336&ssl=1)
సారథి న్యూస్, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ కలెక్టర్ ఈ.శ్రీధర్పై ఆదివారం బదిలీవేటు పడింది. వనపర్తి జిల్లా కలెక్టర్ యాష్మిన్బాషాకు నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను సరిగ్గా నిర్వహించలేదనే కారణంతో బదిలీ వేటుపడినట్లు తెలుస్తోంది. అలాగే గృహనిర్మాణశాఖ అదనపు బాధ్యతల నుంచి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ను ప్రభుత్వం తప్పించింది. ఆమె స్థానంలో సునీల్శర్మకు అదనపు బాధ్యతలు అప్పగించింది.