Breaking News

నాకు ప్రాణహాని ఉంది.. కాపాడండి

న్యూఢిల్లీ: కొందరు తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని.. తన ప్రాణాలను కాపాడాలని ఫేస్​బుక్​ పబ్లిక్​ పాలసీ డైరెక్టర్​ అంకిదాస్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని ఆమె పోలీసులను కోరారు. అమెరికాకు చెందిన వాల్​స్ట్రీట్​ జర్నల్‌(డబ్ల్యూఎస్‌జే) ఫేస్​బుక్​పై ఓ సంచలన కథనం ప్రచురించింది. ఈ కథనం మనదేశ రాజకీయాల్లో తీవ్రదుమారం రేపింది. భారత్​లో ఫేస్​బుక్​.. బీజేపీ ములాఖత్​ అయ్యాయని అందుకే బీజేపీకి చెందినవారు హింసాత్మక పోస్టులు చేసిన ఫేస్​బుక్​ తొలిగించడం లేదని ఆ పత్రిక కథనంలో పేర్కొంది. ఈ కథనాన్ని ఆధారంగా చేసుకొని కాంగ్రెస్​ నేతలు బీజేపీపై విరుచుకుపడ్డారు. కాగా ఈ విషయంపై ఫేస్​బుక్​ వివరణ ఇచ్చింది. తాము ఏ రాజకీయపార్టీకి అనుకూలంగా వ్యవహరించడం లేదని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఒకేరకమైన నిబంధనలు అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో అంకిదాస్​ ఫిర్యాదు సంచలనంగా మారింది.