![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/ANKI-DASSSFF.jpg?fit=700%2C394&ssl=1)
న్యూఢిల్లీ: కొందరు తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని.. తన ప్రాణాలను కాపాడాలని ఫేస్బుక్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంకిదాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని ఆమె పోలీసులను కోరారు. అమెరికాకు చెందిన వాల్స్ట్రీట్ జర్నల్(డబ్ల్యూఎస్జే) ఫేస్బుక్పై ఓ సంచలన కథనం ప్రచురించింది. ఈ కథనం మనదేశ రాజకీయాల్లో తీవ్రదుమారం రేపింది. భారత్లో ఫేస్బుక్.. బీజేపీ ములాఖత్ అయ్యాయని అందుకే బీజేపీకి చెందినవారు హింసాత్మక పోస్టులు చేసిన ఫేస్బుక్ తొలిగించడం లేదని ఆ పత్రిక కథనంలో పేర్కొంది. ఈ కథనాన్ని ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ నేతలు బీజేపీపై విరుచుకుపడ్డారు. కాగా ఈ విషయంపై ఫేస్బుక్ వివరణ ఇచ్చింది. తాము ఏ రాజకీయపార్టీకి అనుకూలంగా వ్యవహరించడం లేదని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఒకేరకమైన నిబంధనలు అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో అంకిదాస్ ఫిర్యాదు సంచలనంగా మారింది.