![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/JAMPANNAAFF.jpg?fit=425%2C280&ssl=1)
సారథిన్యూస్, ములుగు: సమ్మక్క, సారలమ్మ దర్శనం కోసం వచ్చిన ఓ వ్యక్తి జంపన్నవాగులో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ సమీపంలోని ఘట్కేసర్ పరిధిలోని శివారెడ్డి గూడకు చెందని సుదర్శన్రెడ్డి (50) స్నేహితులతో కలిసి అమ్మవార్లను దర్శించుకొనేందుకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి వచ్చారు. దైవదర్శనానికి ముందు జంపన్నవాగులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయిన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.