Breaking News

‘దిశ’ మారింది

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్​వరుణ్ తేజ హీరోగా తెరకెక్కించిన ‘లోఫర్’ లో హీరోయిన్ గా నటించింది బాలీవుడ్ భామ దిశా పటాని. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేదు. తర్వాత దిశకు తెలుగులో అంతగా ఆఫర్లు రాకపోవడంతో నేటివ్ అయిన బాలీవుడ్​కు వెళ్లింది. అక్కడ ధోని జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘ధోని’ చిత్రంలో సుషాంత్ సరసన నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి అక్కడ. దాంతో టాలీవుడ్ వైపు కన్నెత్తి చూడడం మానేసింది. గతేడాది విడుదలైన ‘భారత్’ చిత్రంలో సల్మాన్ ఖాన్ కు జంటగా నటించి మంచి హిట్ అందుకుంది. కాగా, దిశ తాజాగా తనకు వచ్చిన ఓ భారీ ఆఫర్ ను వదులుకుందట. అది కూడా హాలీవుడ్ మూవీ ఆఫర్ అని సమాచారం. నేను బాలీవుడ్ కే ప్రాధాన్యం ఇస్తాను.. హాలీవుడ్ సినిమాలకు వెచ్చించేంత టైమ్ నాకు లేదు అంటోంది దిశ. ప్రస్తుతం సల్మాన్ ఖాన్​తోనే మళ్లీ జోడీ కడుతోంది. సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాధే’ చిత్రంలో ప్రధాన హీరోయిన్ గా నటిస్తోంది దిశా పటాని.

‘దిశ’ మారింది
దిశ పటాని