Breaking News

దంచికొడుతున్న వానలు

దంచికొడుతున్న వానలు

సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 13.6 అడుగులకు నీటిమట్టం చేరింది. గోదావరి నదిలోకి 74,723 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇలా ఉండగా, పాల్వంచ మండలంలో కురుస్తున్న భారీవర్షాలకు లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. పాల్వంచ- భద్రాచలం హైవే(ఎన్ హెచ్ నం.225)పై వర్షపు నిండి రాకపోకలకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.