Breaking News

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • ఇకపై ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్​
  • మున్సిపల్​ అధికారులకు ఆదేశాలు

సారథి న్యూస్, హైదరాబాద్: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్లాస్టిక్ వినియోగం, విక్రయాలు, నిల్వలపై భారీ జరిమానాలు విధించేందుకు మున్సిపల్​శాఖ సిద్ధమైంది. ప్లాస్టిక్ వాడకం.. పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోందని, దీనిపై ప్రజలకు అవగాహన పెంచాలని రాష్ట్రంలోని మున్సిపాలిటీల అధికారులకు సూచించింది. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాన్ని ప్రోత్సహించడమే కాకుండా.. రిటైలర్లు, వ్యాపారులు ప్లాస్టిక్ వాడకం, అమ్మకాలు జరపకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కాగా, బహిరంగ ప్రదేశాల్లో జరిగే పెళ్లిళ్లు, ఉత్సవాలు, సామూహిక కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలని పేర్కొంది.