Breaking News

తెలంగాణ పథకాలు.. దేశానికే ఆదర్శం

సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్రంలో పేదల ప్రభుత్వం కొనసాగుతున్నదని మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. మంగళవారం మెదక్​ జిల్లా నిజాంపేట, రామాయంపేట మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు టీఆర్​ఎస్​ నేతలు పాల్గొన్నారు.