సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నుంచే కరోనాకు తొలి టీకా వస్తుందని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ఆశాభావం వ్యక్తంచేశారు. హైదరాబాద్ లోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటిక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ ను మంత్రి మంగళవారం సందర్శించారు. వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ ముందంజలో ఉండడం గర్వంగా ఉందన్నారు. టీకాల తయారీలో భారత్ భాగస్వామ్యం కీలకమైందని ప్రపంచ దేశాలు పదేపదే చెబుతున్నాయని గుర్తుచేశారు. మంత్రితో భారత్బయోటెక్ఎండీ డాక్టర్కృష్ణా ఎల్లా, డాక్టర్సుచిత్ర ఎల్లా తదితరులు పలు అంశాలపై చర్చించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ మంత్రి వెంట ఉన్నారు.
- August 4, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- BHARATH BIOTECH
- CARONA VACCINE
- MINISTER KTR
- WHO
- కరోనా టీకా
- భారత్బయోటెక్
- మంత్రి కేటీఆర్
- Comments Off on తెలంగాణ నుంచే కరోనా టీకా