Breaking News

తెలంగాణ నుంచి ఏపీకి మద్యం

తెలంగాణ నుంచి ఏపీకి మద్యం

  • పంచలింగాల వద్ద విస్తృతంగా సోదాలు
  • 1,600 సీసాలు స్వాధీనం
  • మూడు వెహికిల్స్​ సీజ్, ముగ్గురిపై కేసు నమోదు

సారథి న్యూస్, కర్నూలు: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్​కు అక్రమంగా మద్యం తరలిస్తున్న అక్రమార్కులపై స్పెషల్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు కన్నేసి ఉంచారు. రాత్రి, పగలు దారికాచి మరీ పట్టుకుంటున్నారు. ఆదివారం రాత్రి నిర్వహించిన సోదాల్లో పెద్దమొత్తంలో మద్యం పట్టుబడింది. పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద సీఐ లక్ష్మిదుర్గయ్య తనిఖీలు నిర్వహించగా, కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎస్.మదన్ మోహన్ రెడ్డి మద్యం తరలిస్తూ పట్టుబడ్డాడు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని మైదుకూరు రోడ్ లో ఉన్న అంబతి శ్రీకాంత్ రెడ్డి నుంచి కూడా 16 బాక్సుల మద్యం స్వాధీనం చేసుకున్నారు. అలాగే కడప జిల్లా చాపాడు మండలం మొరాయపల్లికు చెందిన టి.సుబ్బారెడ్డి అనే వ్యక్తి నుంచి 19 పెట్టెలు మద్యం సీసాలను పట్టుకున్నారు. ఇతర రాష్ట్రాల మద్యాన్ని ఏపీలోకి తీసుకురావడం, అమ్మడం నేరమని, ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సోదాల్లో హెబ్ హెడ్ కానిస్టేబుల్ షరీఫ్, కానిస్టేబుల్ సందీప్ పాల్గొన్నారు.