Breaking News

తెలంగాణ ఎంసెట్​ షెడ్యూల్​ ఖరారు

తెలంగాణ ఎంసెట్ కు రెడీ

హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబ‌ర్ 9,10,11,14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో ఎగ్జామ్​ జరగనుంది. ఇందుకోసం తెలంగాణలో 79, ఏపీలో 23 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈసారి జరిగే ఎంసెట్ కు 1,43,165 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. సెప్టెంబర్​3 నుంచి ఈనెల 7వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే ఎంసెట్ నిర్వహించాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. ఎగ్జామ్​సెంటర్లకు వచ్చే అభ్యర్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని సూచించారు. రెండు రోజుల నుంచి జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎంసెట్ పరీక్షలకు సైతం అదే తరహాలో ఏర్పాట్లు చేయనున్నారు. హాల్​టికెట్ల డౌన్ లోడ్​ కోసం www.eamcet.tsche.ac.in వెబ్ సైట్‌ను సందర్శించాలని జేఎన్టీయూ సూచించింది.