Breaking News

తెలంగాణలో 1,967 కరోనా కేసులు

తెలంగాణలో 1,967 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం 1,967 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 99,391 పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా మహమ్మారి బారినపడి 8 మంది మృతిచెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 737కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్​కేసులు 21,687 ఉన్నాయి. 24 గంటల్లో 26, 767 వైరస్​నిర్ధారణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,48,078 శాంపిల్​టెస్టులు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా.. 473 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ హెల్త్​ బులెటిన్​

జిల్లాల వారీగా పరిశీలిస్తే.. భద్రాద్రి కొత్తగూడెం 21, జగిత్యాల 81, జనగామ 22, జోగుళాంబ గద్వాల 55, కామారెడ్డి 55, కరీంనగర్​86, ఖమ్మం 79, మంచిర్యాల 40, మెదక్​24, మేడ్చల్​మల్కాజిగిరి 170, నాగర్​కర్నూల్​27, నల్లగొండ 60, రంగారెడ్డి 202, సంగారెడ్డి 38, సిద్దిపేట 49, సూర్యాపేట 28, వనపర్తి 21, వరంగల్​రూరల్​26, వరంగల్​అర్బన్​101, యాదాద్రి భువనగిరి 18.. చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది.