Breaking News

తెలంగాణలో 1,640 కేసులు

తెలంగాణలో 1,640 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం 1,640 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు 52,466 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా, మహమ్మారి బారినపడి 8 మంది మృతిచెందారు. ఇప్పటివరకు 447 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు 3, 37, 771 శాంపిల్​టెస్టులు నిర్వహించారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 683 నమోదయ్యాయి. అలాగే జయశంకర్ భూపాలపల్లి 24, కామారెడ్డి 56, కరీంనగర్​100, మహబూబాబాద్​44, మెదక్​22, మేడ్చల్​30, నాగర్​కర్నూల్​52, నల్లగొండ 42, పెద్దపల్లి 98, రాజన్నసిరిసిల్ల 20, రంగారెడ్డి 135, సంగారెడ్డి 102, వరంగల్​రూరల్​22, వరంగల్​అర్బన్​ 36 చొప్పున పాజిటివ్​కేసుల నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మీడియా​ బులెటిన్​ను విడుదల చేసింది.