![తెలంగాణలో 1,640 కేసులు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/carona-2f-6.jpg?fit=620%2C413&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం 1,640 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు 52,466 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా, మహమ్మారి బారినపడి 8 మంది మృతిచెందారు. ఇప్పటివరకు 447 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు 3, 37, 771 శాంపిల్టెస్టులు నిర్వహించారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 683 నమోదయ్యాయి. అలాగే జయశంకర్ భూపాలపల్లి 24, కామారెడ్డి 56, కరీంనగర్100, మహబూబాబాద్44, మెదక్22, మేడ్చల్30, నాగర్కర్నూల్52, నల్లగొండ 42, పెద్దపల్లి 98, రాజన్నసిరిసిల్ల 20, రంగారెడ్డి 135, సంగారెడ్డి 102, వరంగల్రూరల్22, వరంగల్అర్బన్ 36 చొప్పున పాజిటివ్కేసుల నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మీడియా బులెటిన్ను విడుదల చేసింది.