Breaking News

తెలంగాణలో 1,417 కరోనా కేసులు

తెలంగాణలో 1,417 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం(24 గంటల్లో) 1,417 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,58,153కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 13 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 974కు చేరింది. ఒకేరోజు 34,426 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ట్రీట్​మెంట్​అనంతరం ఒకేరోజు 2,479 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 1,27,007 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,532 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్ లో మరో 23,639 మంది ఉన్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది.