![తెలంగాణను అగ్రశ్రేణిగా నిలబెట్టాలి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/11/KTR1.jpg?fit=677%2C429&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణను అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలబెట్టాలని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు ఆకాంక్షించారు. సనత్ నగర్ లో సుమారు రూ.ఐదుకోట్ల వ్యయంతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో రెండు బ్యాడ్మింటన్ కోర్టులు, లేడీస్ జిమ్, టేబుల్ టెన్నిస్, యోగా సెంటర్, క్యారమ్స్ ఆడేందుకు సదుపాయాలు కల్పించారు. అలాగే సనత్ నగర్ నెహ్రూ పార్కులో థిమ్ పార్కు నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు రూ.3.6 కోట్ల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/11/KTR22-1.jpg?resize=640%2C439&ssl=1)