Breaking News

తమిళ హీరోయిన్​కు కరోనా

మరో హీరోయిన్​కు కరోనా

తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన ప్రముఖ సినీ హీరోయిన్​ నిక్కీ గార్లాని కరోనా బారిన పడ్డారు. స్వయంగా ఆమె ట్విట్టర్​లో ఈ విషయాన్ని వెల్లడించింది. తనకు కరోనా సోకిందని.. హోమ్​ ఐసోలేషన్​లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పింది. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించింది. నిక్కి తెలుగులో సునీల్​ హీరోగా నటించిన కృష్ణాష్టమి చిత్రంలో నటించింది. పలు తమిళ చిత్రాల్లోనూ ఆమె నటించింది. ప్ర‌స్తుతం లారెన్స్ న‌టిస్తున్న రంగ‌స్థ‌లం త‌మిళ్ రీమేక్‌లో స‌మంత పాత్ర‌లో నిక్కీ న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం.