Breaking News

తగ్గని మాయదారి రోగం

తగ్గని మాయదారి రోగం

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా తగ్గడం లేదు. రాష్ట్రంలో మంగళవారం 1,879 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏడుగురు మృతిచెందారు. మొత్తం మృతుల సంఖ్య 313కు చేరింది. మొత్తంగా రాష్ట్రంలో 27,612 పాజిటివ్​ కేసులు నిర్ధారణ అయ్యాయి.
1,28,438 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే జీహెచ్​ఎంసీ పరిధిలో 1,422, రంగారెడ్డి జిల్లాలో 176 కేసులు, మేడ్చల్​ జిల్లాలో 94, కరీంనగర్​లో 32, నల్లగొండ 31, నిజామాబాద్​లో 19 చొప్పున పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్​ బులెటిన్​ విడుదల చేసింది.