Breaking News

డిండి వాగులో చిక్కిన భార్యాభర్తలు సేఫ్

డిండి వాగులో చిక్కిన భార్యాభర్తలు సేఫ్

సారథి న్యూస్, అచ్చంపేట: భారీవర్షాలకు నాగర్​కర్నూల్ ​జిల్లా అచ్చంపేట సమీపంలోని డిండి వాగు ఉధృతిలో చిక్కుకుపోయిన భార్యాభార్తలు సురక్షితంగా బయటపడ్డారు. అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన సభావత్ వెంకట్రాములు, విజయ దంపతులు వ్యవసాయ పొలం పనులకు వెళ్లారు. వాగు ఉధృతి పెరగడంతో బుధవారం సాయంత్రం నీటిలో కొట్టుకుపోయి.. చెట్లను పట్టుకుని ఒడ్డుకు చేరారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​గువ్వల బాలరాజు సీఎం కేసీఆర్​, సీఎస్​ సోమేశ్​కుమార్​తో మాట్లాడి హెలిక్యాప్టర్​, ఎన్డీఆర్ఎఫ్ ​బృందాలను పంపించాలని కోరారు. నాగర్​కర్నూల్ ​జిల్లా కలెక్టర్​ఎల్.శర్మన్, ఎస్పీ సాయిశేఖర్ ​దగ్గరుండి ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్​డీఆర్ఎఫ్​ బృందాలు తీవ్రంగా శ్రమించి 1.30 గంటల ప్రాంతంలో సభావత్​ వెంకట్రాములు, విజయ దంపతులను క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ విప్​ గువ్వల బాలరాజు బాధిత దంపతులను ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే చొరవకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

సభావత్ వెంకట్రాములు, విజయ దంపతుల తీసుకొస్తున్న ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు