Breaking News

జేసీ ప్రభాకర్​రెడ్డికి బెయిల్​

జేసీ ప్రబాకర్​ రెడ్డికి బెయిల్​

సారథి న్యూస్​, అనంతపురం : జేసీ దివాకర్​రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే జేపీ ప్రభాకర్​రెడ్డి బుధవారం బెయిల్​పై విడుదలయ్యారు. బీఎస్​3 వాహనాలను బీఎస్​4 మార్చి రిజిస్టర్​ చేయించారనే ఆరోపణలతో జేసీని, ఆయన కుమారుడు అస్మిత్​రెడ్డిని పోలీసులు అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ ప్రస్తుతం కడప జిల్లా జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్నారు. బెయిల్​ రావడంతో వీరిద్దరూ జైలు నుంచి విడుదలయ్యారు. జేసీ ట్రావెల్స్ మాజీ ఉద్యోగులు నాగేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో ఐదుగురిపై తాడిపత్రి పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బీఎస్-3 వాహనాలను బీఎస్ – 4 వాహనాలుగా మార్చి తమకు అమ్మారని లారీ డ్రైవర్లు ఆరోపించారు. తమకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.