![జూరాల 4గేట్ల ఎత్తివేత](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/JURALA-2F.jpg?fit=677%2C460&ssl=1)
సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు జూరాలకు నిలకడగా వరద కొనసాగుతోంది. ప్రస్తుతం నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలలో ప్రస్తుతం 9.657 టీఎంసీల నీటిమట్టం ఉంది. ప్రస్తుతం జూరాలకు 63,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఇలా ప్రాజెక్టు నుంచి మొత్తం 60,856 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. నాలుగుగేట్ల ద్వారా 22,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి 35,974 క్యూసెక్కుల నీటిని వినియోగించగా, కుడి, ఎడమ, సమాంతర కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు. వారం రోజుల నుంచి జూరాలకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో జూరాల గేట్లు మూసివేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు నారాయణపూర్ డ్యాం నుంచి 51,531 క్యుసెక్కుల వరద ప్రవాహం జూరాల జలాశయానికి చేరుతోంది. నీటి ఉధృతి పెరగడంతో గేట్లను ఎత్తివేశారు.