Breaking News

జూరాల.. కళకళ

జూరాల.. కళకళ

సారథి న్యూస్, గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు నీటిఉద్ధృతి పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షంతో వరద నీరు చేరుతోంది. 9.516 టీఎంసీలకు గానూ 5.638 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద చేరుతోంది. గతేడాది జులైతో పోలిస్తే నీటి నిల్వ గరిష్ఠంగా ఉంది. దీంతో ఆయకట్టు రైతులకు ఆశలు చిగురిస్తున్నాయి. 2019లో ఇదే సమయానికి 1.75 టీఎంసీల నీటిమట్టం ఉండగా, ప్రస్తుతం 5.638టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 316.30 మీటర్లుగా ఉంది. 9.516 టీఎంసీలకు గానూ 5.638 టీఎంసీల నీటి నిల్వ ఉంది.