Breaking News

జీహెచ్​ఎంసీలో కరోనా పంజా

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో ఆదివారం 154 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్​ఎంసీ పరిధి నుంచే 132 కేసులు పాజిటివ్​గా నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 12, మేడ్చల్​లో 3, యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు, సిద్దిపేట, మహబూబాబాద్​, సంగారెడ్డి, నాగర్​కర్నూల్​, కరీంనగర్​ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇలా ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య 3,650 కు చేరింది. ఆదివారం ఒకే రోజు 14 మంది చనిపోయారు. ప్రస్తుతం 1771 మంది వివిధ ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్​ తీసుకుంటున్నారని అధికారులు పేర్కొన్నారు.