Breaking News

జీఎస్టీ పరిహారం కేంద్రమే చెల్లించాలి

జీఎస్టీ పరిహారం కేంద్రమే చెల్లించాలి

సారథి న్యూస్, హైదరాబాద్: జీఎస్టీ పరిహారం కేంద్రమే చెల్లించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు డిమాండ్​చేశారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.5,420 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. జీఎస్టీ పరిహారంలో సెస్ మిగిలితే కేంద్రం కన్సాలిడేట్ ఫండ్ లో జమచేసి వాడుకుంటుందని వివరించారు. గురువారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్నిరాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులు హాజరయ్యారు. బీఆర్కే భవన్ నుంచి మంత్రి టి.హరీశ్​రావు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ డిమాండ్లను ఆయన తెలిపారు. సెస్ తగ్గినప్పుడు రాష్ట్రాలు అప్పు తీసుకోవాలనడం సరికాదని అభ్యంతరం తెలిపారు. ఐజీఎస్టీ సమావేశం వెంటనే‌ నిర్వహించాలని కోరారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.2,700 కోట్లను త్వరగా విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక, వాణిజ్య పన్నులశాఖ అధికారులు పాల్గొన్నారు.