Breaking News

జగన్​ పాలన బాగుంది.. తేల్చిన సర్వే

ఇండియా టుడే సర్వే.. జగన్​కు మూడో స్థానం

ఢిల్లీ: విపక్షాల ఆరోపణలు, కోర్టు వ్యతిరేక తీర్పులు, అమరావతి ఉద్యమం ఇవేవీ ఏపీ సీఎం వైఎస్​ జగన్​పై ప్రజలకు ఉన్న ఆదరణను ఏమాత్రం తగ్గించలేకపోయాయి. భారీమెజార్టీతో అధికారం చేపట్టిన ఏపీ సీఎం వైఎస్​ జగన్మోహన్​రెడ్డి ఎన్నో సంక్షేమపథకాలను ప్రారంభించారు. అయినప్పటికీ ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. అనేక జీవోలను కోర్టు రద్దుచేసింది కూడా. అయినప్పటికీ ప్రజల్లో జగన్​పై ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. అందుకు నిదర్శనమే తాజాగా ఇండియా టుడే చేసిన సర్వే. ఈ సర్వేలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి దేశంలోనే మూడోస్థానంలో నిలిచారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌కు ప్రథమ స్థానం దక్కగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు.