Breaking News

జంపన్నవాగులో బాలుడు గల్లంతు

జంపన్నవాగులో బాలుడు గల్లంతు

సారథి న్యూస్, వాజేడు, తాడ్వాయి: ప్రమాదవశాత్తు జంపన్నవాగులో పడి బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గ్రామంలో బుధవారం విషాదం నింపింది. మేడారం గ్రామానికి చెందిన మహేందర్, యాద లక్ష్మిల కుమారుడు పల్లపు తరుణ్(14) బుధవారం బంధువుల పిల్లలతో కలిసి జంపన్న వాగు అవతల ఉన్న కొత్తూరు గ్రామానికి వెళ్లి తిరిగివస్తుండగా కొంగల మడుగు వద్ద గల లోవెల్ బ్రిడ్జిపై దాటుతుండగా ప్రవాహం పెరిగి వాగులో పడిపోయాడు. ఈత రాకపోవడం వల్ల జంపన్న వాగు లో ప్రవాహనికి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు తల్లిదండ్రులు భారీ సంఖ్యలో వాగువద్దకు చేరుకుని గాలించారు. విషయం తెలుసుకున్న తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్​రావు హుటాహుటిన సీఆర్​పీఎఫ్​ సివిల్ పోలీసులతో ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే తరుణ్ ఆచూకీ లభ్యం కాలేదు.