![‘చంద్రబాబు దళితులకు చేసిందేమీ లేదు’](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/ysrcp-2f.jpg?fit=655%2C442&ssl=1)
సారథి న్యూస్, కర్నూలు: వచ్చే ఎన్నికల్లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని వైఎస్సార్ సీపీ నగర సమన్వయకర్త మాదారపు కేదార్ నాథ్ అన్నారు. సోమవారం బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలు పాత బస్టాండ్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు దళితుల కోసం చేసిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సత్రాల రాజేష్, జశ్వంత్, సంపత్ కుమారి, వసంత్, జమ్మన, సురేఖ పాల్గొన్నారు.