Breaking News

చంద్రబాబును తెలుగుజాతి క్షమించదు

సారథిన్యూస్​, రామగుండం: బషీర్​బాగ్​లో అప్పటి సీఎం చంద్రబాబు సృష్టించిన మారణకాండ తెలుగుజాతి ఎప్పటికీ మరిచిపోదని వామపక్షాల నేతలు పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వామపక్షాల నేతలు బషీర్​బాగ్​ అమరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు లాంటి దుర్మార్గుడిని తెలుగుజాతి ఎప్పటికి క్షమించబోదని పేర్కొన్నారు. పెంచిన విద్యుత్​ చార్జీలు తగ్గించాలంటూ ధర్నాచేసిన అమాయకరైతులను, వామపక్ష ఉద్యమకారులను చంద్రబాబు ప్రభుత్వం అమానుషంగా పొట్టనపెట్టుకున్నదని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు గౌతం గోవర్ధన్, వై యాకయ్య, కే రాజన్న, కె కనకరాజ్, మద్దెల దినేష్, మడ్డి ఎల్లయ్య, ఎల్ ప్రకాష్, రాజారత్నం, రెనికుంట్ల ప్రీతమ్, నాగమణి, ఇదునూరి నరేశ్​, తొకల రమేష్ దుర్గయ్య, ఎల్ ప్రకాశ్​, కే రాజరత్నం, ఎంఎ గౌస్ శనిగరపు చంద్రశేఖర్, ఈర్ల రామచంద్ర ఇనుముల రాజమౌళి, కుమారస్వామి, లింగయ్య, జనగామ మల్లేష్, ధర్మేంద్ర, తదితరులు పాల్గొన్నారు.