Breaking News

గ్రాడ్యుయేట్ ​ఎన్నికల ఓటరు నమోదు షురూ

గ్రాడ్యుయేట్​ఎన్నికల ఓటరు నమోదు షురూ

సారథి న్యూస్, హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. వచ్చేనెల 1వ తేదీ నుంచి ఓటరు నమోదుకు నోటీస్ జారీచేసింది. నవంబర్ 6వ తేదీ వరకు కొత్త ఓటరు నమోదుకు దరఖాస్తులను స్వీకరించనుంది. డిసెంబర్ 1న ఓటరు జాబితా ముసాయిదా విడుదల చేయనుంది. డిసెంబర్ 31వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించి.. 2021 జనవరి 12వ తేదీ వరకు అభ్యంతరాలను పరిష్కరించనుంది. జనవరి18న ఫైనల్ ఓటర్ జాబితాను విడుదల చేయనుంది.