Breaking News

గురుకుల స్టూడెంట్స్​కు ఆన్​లైన్ ​క్లాసెస్​

గురుకుల స్టూడెంట్స్​కు ఆన్​లైన్ ​క్లాసెస్​

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుండడంతో స్కూలు, కాలేజీలు, యూనివర్సిటీలు మూతపడ్డాయి. అయితే విద్యార్థులు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. చదువుతున్న స్కూలు, ఇంటర్​మీడియట్, డిగ్రీ స్టూడెంట్స్​కు ‘జ్ఞానదీక్ష’పేరుతో ‘దూరదర్శన్–యాదగిరి’ చానెల్​ద్వారా ఆన్​లైన్​ పాఠాలు చెప్పనున్నారు. ప్రతిరోజు అరగంట పాటు(30 నిమిషాలు) మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల వరకు పాఠాలు ప్రసారం చేయనున్నారు.

జులై 6 నుంచి 18వ తేదీ వరకు డిగ్రీ విద్యార్థులకు, జులై 21 నుంచి 31వ తేదీ వరకు ఇంటర్​మీడియట్​విద్యార్థులకు, ఆగస్టు 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు స్కూలు స్థాయి విద్యార్థులకు పాఠాలు చెబుతారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, కామర్స్, ఎకనామిక్స్, సోషల్​ స్టడీస్, మ్యూజిక్ ​వంటి సబ్జెక్టుల్లో ఎంపికచేసిన అంశాలు, కాన్సెప్టుల వారీగా నిపుణులైన టీచర్లు, లెక్చరర్లు బోధించనున్నారు. కరోనా సమయంలో విద్యార్థులు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా లెసన్స్​ను సద్వినియోగం చేసుకోవాలని గురుకులాల కార్యదర్శి డాక్టర్​ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్ సూచించారు. పేరెంట్స్​తమ పిల్లలను ప్రోత్సహించాలని కోరారు.