Breaking News

గిరిజనుల హక్కుల రక్షణకు కట్టుబడి ఉన్నాం..

సారథి న్యూస్​, హైదరాబాద్​: గిరిజనుల హక్కుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టంచేశారు. జీవోనం.3ను కొనసాగించేలా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు సీఎం కేసీఆర్​ అంగీకరించారని తెలిపారు. గురువారం మాసాబ్​ట్యాంక్​లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని టీచర్ ఉద్యోగాలను వందశాతం గిరిజనులతోనే భర్తీ చేసేందుకు 2000లో ఇచ్చిన జీవోనం.3ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేయడం దురదృష్టకరమన్నారు. ఈ విషయమై ఇప్పటికే రెండుసార్లు కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ ముండాతో మాట్లాడినట్లు మంత్రి తెలిపారు. సమీక్షలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.