Breaking News

గణేశ్​ మండపాలకు నో పర్మిషన్​

గణేశ్​ మండపాలకు అనుమతి లేదు

సారథి న్యూస్​, నల్లగొండ: ప్రస్తుత పరిస్థితుల్లో గణేశ్​ మండపాలు, నవరాత్రి ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేమని నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్​ స్పష్టం చేశారు. కరోనా విపత్తువేళ హిందూ సోదరులంతా పోలీస్​శాఖకు సహకరించాలని ఆయన కోరారు. గణేశ్​ మండపాల నిర్వాహకులకు త్వరలోనే కౌన్సెలింగ్​​ నిర్వహిస్తామన్నారు. ప్రజలంతా ఇండ్లల్లోనే పూజలు చేసుకోవాలని కోరారు. తయారీదారులు విగ్రహాలను తయారు చేసి ఇబ్బందులు తెచ్చుకోవద్దని.. కరోనా పోయేంత వరకు ఇతర ఉపాధి మార్గాలను వెతుక్కోవాలని సూచించారు.