Breaking News

ఖుష్భూపై సొంతపార్టీ నేతలు ఫైర్​

కుష్డూపై సొంతపార్టీ నేతలు ఫైర్​

చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం బాగున్నదని సినీ నటి, కాంగ్రెస్​ నాయకురాలు ఖుష్భూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఓ ట్వీట్​ చేశారు. అయితే కుష్బూపై సొంతపార్టీ నేతలే ఫైర్​ అవుతున్నారు. కేంద్ర నూతన విద్యావిధానంపై కాంగ్రెస్​ యువ నేత రాహుల్​ సహా ఆ పార్టీ నేతలంతా విమర్శించారు. ఈ నేపథ్యంలో కుష్బూ చేసిన ట్వీట్​ సంచలనంగా మారింది. కుష్బూ పార్టీ లైన్​ను దాటి మాట్లాడిందని నేతలు ఆరోపించారు. అది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమేనని ఆమె వివరణ ఇచ్చుకున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్​ నేతలు మాత్రం ఆమెపై విరుచుకుపడుతున్నారు.