![కొరత లేకుండా ఎరువులు, విత్తనాలు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/12/MDK33.jpg?fit=677%2C344&ssl=1)
సారథి న్యూస్, మెదక్: ఈ యాసంగి సీజన్లో ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి వ్యవసాయాధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ యాసంగి సీజన్ కు మెదక్ జిల్లాలో 7,672 మంది రైతులు అర్హులుగా గుర్తించామని, ఈ నెల 21లోపు తమ బ్యాంకు ఖాతా వివరాలను ఏఈవోలకు అందజేయాలని సూచించారు. జూన్ నుంచి ఈనెల 10 వరకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతుల పాస్ బుక్, బ్యాంకు ఖాతానం., ఆధార్ కార్డు వివరాలు సేకరించాలని సూచించారు.